IIM-Indore | ఇండోర్లోని ఐఐఎంలో విద్యాభ్యాసం పూర్తి చేసిన విద్యార్థుల్లో ఒకరికి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఏడాదికి రూ. కోటి వేతన ప్యాకేజీ ఆఫర్ చేసింది. ఈ ఏడాది చివరి దశ ప్లేస్మెంట్లలో ఇదే అత్యధిక ప్యాకేజీ. ఇది విద్యార్థితోపాటు ఐఐఎం- ఇండోర్కు కీలక అచీవ్మెంట్గా నిలుస్తుంది. సదరు ఈ-కామర్స్ సంస్థలో సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో పని చేసేందుకు ఆ విద్యార్థికి ఈ ఆఫర్ లభించింది. దేశీయంగా వచ్చిన ఆఫర్ ఇది అని ఐఐఎం-ఇండోర్ అధికారి ఒకరు పీటీఐకి చెప్పారు.
ఐఐఎం-ఇండోర్లో జరిగిన చివరి విడుత ప్లేస్మెంట్స్లో 150 కంపెనీలు 594 మంది విద్యార్థులకు చివరి విడత ఆఫర్లు వచ్చాయి. ఈ ఇంటర్వ్యూల్లో రెండేండ్ల పీజీ ప్రోగ్రామ్, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (ఐపీఎం) విద్యార్థులు ప్లేస్మెంట్స్ పొందారు. ప్లేస్ మెంట్ పొందిన విద్యార్థులకు లభించిన ఆఫర్ సగటున రూ.25.68 లక్షల వేతనం అని ఐఐటీ ఇండోర్ తెలిపింది.
ప్రస్తుతం ఉద్యోగాల మార్కెట్లో సవాళ్లు ఎదురవుతున్నా ఐఐఎం-ఇండోర్ తన పేరు నిలుపుకోవడంతోపాటు అతిపెద్ద కంపెనీలను ఆకర్షించగలిగింది. ఈ ఏడాది కొత్తగా 50కి పైగా సంస్థలు తమ సంస్థలో ప్లేస్ మెంట్ ఇంటర్వ్యూలు నిర్వహించాయని ఐఐఎం ఇండోర్ డైరెక్టర్ హిమాంశు రాయ్ తెలిపారు.