IIM Bangalore : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, బెంగళూర్ (IIM Bangalore) సమ్మర్ ప్లేస్మెంట్స్లో మేనేజ్మెంట్లో పోస్ట్గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం (పీజీపీ) విద్యార్ధులు ఆకర్షణీయ ఆఫర్లను అందుకున్నారు. పీజీపీ, పీజీపీ బిజినెస్ ఎనలిటిక్స్ విద్యార్ధుల్లో 484 మందికి జాబ్ ఆఫర్లు దక్కాయి. ఈ ప్లేస్మెంట్స్లో 12 మంది దివ్యాంగ విద్యార్ధులకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు ప్లేస్మెంట్ ఆఫర్ చేశాయి.
సమ్మర్ ప్లేస్మెంట్స్లో పలు నియామక సంస్ధలు తొలిసారిగా స్ట్రేటజీ, మార్కెటింగ్, ప్రోడక్ట్, ఫైనాన్స్, అనలిటిక్స్, ఇన్వెస్ట్మెంట్స్లో జాబ్ ఆఫర్స్తో ముందుకొచ్చాయని, ఆయా ప్రాజెక్టులు చాలా ఆసక్తికరంగా సవాళ్లతో కూడుకున్నవని ఐఐఎం బెంగళూర్ కెరీర్ డెవలప్మెంట్ సర్వీసలు, ఫ్యాకల్టీ, స్ట్రేటజీ ఏరియా చైర్పర్సన్ ప్రొఫెసర్ గణేష్ ఎన్ ప్రభు పేర్కొన్నారు.
ఇక ప్లేస్మెంట్స్లో కన్సల్టింగ్ కంపెనీలు అత్యధికంగా 158 ఆఫర్లను అందించగా, యాక్సెంచర్ స్ట్రేటజీ 45 ఆఫర్లను, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు 130 ఆఫర్లతో ముందుకొచ్చాయని ఐఐఎం బెంగళూర్ వెల్లడించింది. ఎఫ్ఎంసీజీ, రిటైల్ కంపెనీలు 69 ఆఫర్లను అందించాయని తెలిపింది. ఇక మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు 55 ఆఫర్లను అందించాయని పేర్కొంది.
Read More :
Brain Chip | మనిషి మెదడులో బ్రెయిన్ చిప్.. ఇది ఎలా పనిచేస్తుందంటే?…