ముంబై: దేశంలోకెల్లా అతిపెద్ద కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ తన ఖాతాదారులకు అనునిత్యం స్మార్ట్గా సేవలు అందించడానికి ప్రాధాన్యం ఇస్తుంది. అందులో భాగంగా మెయింటెనెన్స్ సేవల్లో భాగంగా ఈ నెల 17 (గురువారం) కొన్ని గంటల పాటు డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవని పేర్కొంది.
ఆ సమయంలో మొబైల్ బ్యాంకింగ్, ఎస్బీఐ యోనో యాప్ తదితర సేవల్లో అంతరాయం ఏర్పడుతుందని ఎస్బీఐ ట్వీట్ చేసింది. ఈ వేళ బ్యాంకు ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
16వ తేదీ అర్ధరాత్రి నుంచి 17వ తేదీ వరకు ఎస్బీఐ సేవలు అందుబాటులో ఉండవు. యోనో, యోనో లైట్, ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) వంటి డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్స్లో సమస్యలు తలెత్తుతాయి.
16వ తేదీ అర్ధరాత్రి 12.30 గంటల నుంచి 17వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటల వరకు బ్యాంకింగ్ సేవలపై ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో ఫ్రాడ్స్టర్ల గురించి అప్రమత్తంగా ఉండాలని ఖాతాదారులను హెచ్చరించింది.
ఈ సమయంలో ఖాతాదారులు తమ వ్యక్తిగత ఖాతా వివరాలు వెల్లడించొద్దని ఎస్బీఐ తెలిపింది. ఏదేనీ అన్ ఐడెంటిటీ సోర్స్ నుంచి ఎటువంటి మొబైల్ యాప్నూ డౌన్లోడ్ చేసుకోవద్దని హితవు చెప్పింది.
ఇతర లింక్లను క్లిక్ చేయడానికి బదులు https://onlinesbi.com అని టైప్ చేసి నేరుగా ఎస్బీఐ వెబ్సైట్లోకి వెళ్లాలని తెలిపింది. ముందుగా కంప్యూటర్ ఓపెన్ చేయగానే యాంటీ వైరస్తో స్కాన్ చేయాలి.
మోసగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు టైం టూ టైం ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ను మార్చుకోవాలి. చివరిసారి లాగిన్ అయిన డేట్, సమయం గుర్తు పెట్టుకోవాలి. మొబైల్ ఫోన్లలో వచ్చే ఏ మెసేజ్ను, లింక్ను క్లిక్ చేయొద్దు. అన్వాంటెడ్ యాప్స్ను డౌన్లోడ్ చేసుకోవద్దు.
బ్యాంక్ వెబ్సైట్పై వ్యక్తిగత వివరాల మీద, పర్సనల్ డేటా అప్డేటింగ్ విషయం రివార్డులను ఇస్తామని పేర్కొంటూ వచ్చే ఈ-మెయిల్స్, ఎస్సెమ్మెస్, ఫోన్ కాల్స్కు స్పందించడం మానుకోవాలి. పబ్లిక్ వై-ఫై, సైబర్ కేఫెలు, షేర్డ్ నెట్వర్క్లను అసలు వాడొద్దు.