ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ కోసం బిడ్ల దాఖలుకున్న గడువును వచ్చే నెల ప్రథమార్ధం వరకు పొడిగించే అవకాశాలున్నాయని శుక్రవారం ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి అన్నారు. ప్రస్తుతం ఐడీబీఐలో కేంద్రానికి, ఎల్ఐసీకి కలిపి 94.71 శాతం వాటా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో 60.72 శాతం అమ్మేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వాటా కోసం మోదీ సర్కారు బిడ్లను ఆహ్వానించింది. బిడ్ల సమర్పణకు ఈ నెల 16 ఆఖరు తేదీ. అయితే గడువును పొడిగించాలన్న అభ్యర్థనలు వస్తున్నాయని, దీంతో జనవరిదాకా పెంచే వీలుందని సదరు అధికారి చెప్తున్నారు.