న్యూఢిల్లీ, మే 20: బీమా వ్యాపారానికి ఐడీబీఐ బ్యాంక్ గుడ్బై పలికింది. ఏగస్ ఇన్సూరెన్స్ ఇంటర్నేషనల్ ఎన్వీతో కలిసి ఏర్పాటు చేసిన ఏగస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్(ఏఎఫ్ఎల్ఐ)లో తనకున్న మొత్తం వాటాను రూ.580 కోట్లకు విక్రయించింది. ఈ విక్రయ ఒప్పందానికి రెగ్యులేటరీ అనుమతులు రావాల్సి ఉంటుంది. మార్చి 31, 2022 నాటికి ఏఎఫ్ఎల్ఐలో ఐడీబీఐ బ్యాంక్కు 25 శాతం వాటా కలిగివున్నది.
ఈ వాటా విక్రయ ఒప్పందం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నాటికి పూర్తికాగలదని ఐడీబీఐ బ్యాంక్ ఆశిస్తున్నది. ఈ ఏఎఫ్ఎల్ఐని ఐడీబీఐ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఏజస్ ఇన్సూరెన్స్ ఇంటర్నేషనల్ ఎన్వీలు సంయుక్తంగా ఏర్పాటుచేశాయి. ఏజెస్..యూరప్, ఆసియాలోని పలు దేశాల్లో బీమా రంగ సేవలు అందిస్తున్నది. మార్చితో ముగిసిన మూడు నెలల్లో సంస్థ రూ.కోట్ల లాభాన్ని గడించింది.