న్యూఢిల్లీ, మే 24: సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక వడ్డీరేటునిచ్చేందుకు గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీ పేరుతో ఐసీఐసీఐ బ్యాంక్ ఒక కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. సాధారణ పౌరులకు ఆఫర్ చేసే వడ్డీ రేటుపై సీనియర్ సిటిజన్లకు ఇప్పటికే అందిస్తున్న 0.50 శాతం అదనపు రేటుకు మరో 0.25 శాతం ఎక్కువ రేటును మొత్తంగా 6.5 శాతం వడ్డీని ఈ ఎఫ్డీపై బ్యాంక్ అందిస్తున్నది.
ఈ ఆఫర్ రూ.2 కోట్లలోపు విలువగల డిపాజిటకు మాత్రమే లభిస్తుంది. 5 సంవత్సరాల ఒక్కరోజు నుంచి పదేండ్ల వరకూ కాలపరిమితిగల ఫిక్స్డ్ డిపాజిట్లపై 2022 అక్టోబర్ 7 వరకూ ఈ ప్రత్యేక వడ్డీ రేటు ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్సైట్ సమాచారం ప్రకారం తాజాగా ప్రారంభించిన డిపాజిట్లకు, ఈ స్కీమ్ అమలులో ఉన్న సమయంలో రెన్యువల్ చేసే డిపాజిట్లకు ఈ ప్రత్యేక వడ్డీ రేటు లభిస్తుంది. కాలపరిమితికంటే ముందుగా విత్డ్రా చేసుకుంటే 1.25 శాతం పెనాల్టీ రేటు వర్తిస్తుంది.