హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ విద్యార్థులకు వర్క్షాప్లు, బూట్క్యాంప్లు, హ్యాకథాన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్లతో అవగాహన కల్పించడంలో భాగంగా టీ-హబ్లో ఐబీసీ కాంటినమ్, వెబ్ 3.0 హ్యాక్ఫెస్ట్ ఛాలెంజ్ను ప్రారంభించింది ఇంటర్నేషనల్ బ్లాక్ చెయిన్ కాంగ్రెస్. ఈ సందర్భంగా తెలంగాణ ఐటీ ముఖ్య కార్యర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రెగ్యులేటర్లు, పాలసీ మేకర్లు, వ్యాపార వేత్తలు, కార్పొరేట్ ప్రతినిధులు, డెవలపర్లను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఇంటర్నెట్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై చర్చించేందుకు హ్యాక్ ఫెస్ట్ దోహదపడనుందన్నారు. తెలంగాణ టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా మాట్లాడుతూ.. వెబ్ 3.0 కోసం ప్రస్తుతం ఉన్న వ్యాపారాలను మెరుగుపర్చడం వల్ల భవిష్యత్తులో ఇది మరిన్ని అవకాశాలను అందిస్తుందన్నారు. ఐబీసీ ఎడ్యుకేషన్ అందించే శిక్షణతో విద్యార్థులు మెరుగైన నైపుణ్యాలను పెంపొందించుకోగలుగుతారని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఈ హ్యాకథాన్ ఈ నెల 29 వరకు జరగనున్నాయి.