న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్..దేశీయ మార్కెట్లోకి సరికొత్త మోడల్ను పరిచయం చేసింది. రూ.9.84 లక్షలు మొదలుకొని రూ.11.76 లక్షల గరిష్ఠ ధరలో నిర్ణయించిన ఈ కారు ‘ఐ20 ఎన్ లైన్’. లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ మోడల్ 88.2 కేడబ్ల్యూతోపాటు ఎన్6, ఎన్6 రకాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఎస్ఎస్ కిమ్ మాట్లాడుతూ..అడ్వాన్స్ టెక్నాలజీతో అంతర్జాతీయంగా కార్లను ప్రవేశపెడుతున్నట్లు, వీటిని భారత మార్కెట్లోకి విడుదల చేయడం జరుగుతున్నదన్నారు. దీంట్లోభాగంగా ఐ20ఎన్ లైన్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టడంతో ఎప్పుడూ ముందుండే సంస్థ ఈ నూతన మోడళ్లోనూ కొన్ని ఫీచర్స్ను ప్రవేశపెట్టింది. వీటిలో మాటతో ఎలక్ట్రిక్ సన్రూఫ్, విండోలను నియంత్రించవచ్చును.