న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటర్స్ కూడా విద్యుత్తో నడిచే వాహనాలపై దృష్టి సారించింది. 2028 నాటికి ఈవీలను ఉత్పత్తి చేయడానికి రూ.4 వేల కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడులతో ఆరు ఈవీ మోడళ్ళను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో ఎస్ఎస్ కిమ్ తెలిపారు. ఈవీల మార్కెట్లోకి 2019లోనే కొనా ఎలక్ట్రిక్ మోడల్తో ప్రవేశించిన సంస్థ..ఈ కారుకు కొనుగోలుదారుల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదు. దీంతో కొనుగోలుదారులు కోరుకుంటున్న విధంగా పలు మోడళ్ళను డిజైనింగ్ చేసే పనిలో పడింది సంస్థ. భవిష్యత్తులో విడుదల చేయనున్నవాటిలో ప్యాసింజర్ వాహనంతోపాటు స్పోర్ట్ యుటిలిటీ వాహనం కూడా ఉన్నది.