న్యూఢిల్లీ : దీపావళి సందర్భంగా భారత్లో ప్రముఖ మోడల్స్పై హ్యుందాయ్ ఇండియా పలు ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటించింది. నవంబర్లో ఎంపిక చేసిన మోడల్స్పై రూ 15,000 నుంచి రూ 1.5 లక్షల వరకూ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్, హ్యుందాయ్ వెన్యూ, వెర్నా, క్రెటా, ఎలాంట్ర, టక్సన్లపై ఎలాంటి డిస్కౌంట్లనూ హ్యుందాయ్ ఇండియా ప్రకటించలేదు.
ఇక శాంట్రో, గ్రాండ్ ఐ10, ఆరా, ఐ20, కొనా ఎలక్ట్రిక్ వంటి మోడల్స్పై భారీ డిస్కౌంట్లను, ఆఫర్లను ప్రకటించింది. హ్యుండాయ్ కొనా ఎలక్ట్రిక్పై అత్యధికంగా రూ 1.5 లక్షల క్యాష్ డిస్కౌంట్తో పాటు రూ 5000 కార్పొరేట్ డిస్కౌంట్ను ప్రకటించింది. హ్యుందాయ్ ఐ20 ఐఎంటీ టర్బోపై రూ 25,000 క్యాష్ డిస్కౌంట్తో పాటు రూ 10,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, కార్పొరేట్ కొనుగోలుదారుల కోసం అదనంగా రూ 5000 డిస్కౌంట్ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.