న్యూఢిల్లీ, జూన్ 18: హ్యుందాయ్ మోటర్ ఇండియా శుక్రవారం దేశీయ మార్కెట్లోకి స్పోర్ట్స్ యుటిలిటి వెహికిల్ (ఎస్యూవీ) శ్రేణిలో తమ సరికొత్త వాహనాన్ని విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో అల్కజార్ పేరుతో పరిచయం చేసింది. ఢిల్లీ ఎక్స్షోరూం ప్రకారం పెట్రోల్ ఆధారిత కారు ప్రారంభ ధర రూ.16.3 లక్షలుగా ఉంటే, గరిష్ఠ ధర రూ.19.84 లక్షలుగా ఉన్నది. ఇక డీజిల్ వేరియంట్ రూ.16.53 లక్షలు-రూ.19.99 లక్షల్లో లభిస్తుంది. 6, 7 సీట్ల సామర్థ్యంతో ఈ వాహనాన్ని హ్యుందాయ్ తీసుకురావడం గమనార్హం. పెట్రోల్ వేరియంట్ లీటర్కు 14.5 కిలోమీటర్లు, డీజిల్ వేరియంట్ 20.4 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వనున్నాయి.