హైదరాబాద్ సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): వ్యర్థాల నిర్వహణలో సమగ్ర సేవలను అందిస్తున్న హైదరాబాద్కు చెందిన స్టార్టప్ రిసైకాల్.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ టెక్నాలజీ పాయనీర్స్-2022కు ఎంపికైంది. భూమిపై అత్యంత క్లిష్టమైన సమస్యగా ఉన్న వ్యర్థాల నిర్వహణలో రిసైకాల్ వినూత్న సేవలు అందిస్తున్నది. తాజా ఎంపికతో రెండేళ్ల పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్యలకు పరిష్కార మార్గాలను చూపేందుకు రిసైకాల్ స్టార్టప్ వ్యవస్థాపకులు పనిచేయాల్సి ఉంటుంది. రిసైకాల్ వ్యవస్థాపకులైన అభయ్ దేశ్పాండేకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే వివిధ కార్యకలాపాలు, చర్చల్లో పాల్గొనేందుకు అవకాశం కూడా ఉంటుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ టెక్నాలజీ పాయనీర్స్-2022కు ఎంపిక కావడం ఆనందంగా ఉందని, తమ సేవలకు ఎంతో గుర్తింపు వచ్చినైట్లెందని దేశ్ పాండే పేర్కొన్నారు. వ్యర్థ పదార్థాల నిర్వహణ రంగాన్ని డిజిటలైజ్ చేయడం, అనధికారిక ఆర్థిక వ్యవస్థలో వ్యర్థాల నిర్వహణలో పనిచేసే కార్మికులకు సమగ్రమైన, నైతికం మద్దతునివ్వడంలో తమ కంపెనీ ఎంతో కృషి చేస్తోందన్నారు.