న్యూఢిల్లీ, ఆగస్టు 30: దేశవ్యాప్తంగా ఇండ్ల ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇండ్ల ధరలు రెండంకెల స్థాయి వరకు అధికమయ్యాయని నేషనల్ హౌజింగ్ బ్యాంక్(ఎన్హెచ్బీ) విడుదల చేసిన రెసిడెక్స్ ఇండెక్స్లో వెల్లడించింది. కానీ, గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో నమోదైన ధరలతో పోలిస్తే వృద్ధి సింగిల్ డిజిట్కు పరిమితమయ్యాయి. అహ్మదాబాద్లో అత్యధికంగా గృహాల ధరలు 13.5 శాతం అధికమవగా…చెన్నైలో 12.5 శాతం పెరిగాయి. ఈ జాబితాలో మూడో స్థానంలో హైదరాబాద్ నిలిచింది. ఇక్కడ ఇండ్ల ధరలు 11.5 శాతం పెరిగాయి. మరోవైపు, నవీ ముంబైలో మాత్రం ధరలు 5.1 శాతం తగ్గడం విశేషం. 2017-18 ఆర్థిక సంవత్సరం బేస్ ఇయర్ ఆధారంగా సంస్థ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 50 నగరాల్లో ధరల ఇండెక్స్ను రూపొందించింది.