న్యూఢిల్లీ, మే 11: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీలో తులం బంగారం ధర రూ.330 తగ్గి రూ.61,370కి దిగొచ్చింది. అంతకుముందు ఇది రూ.61,700గా ఉన్నది.
వెండి ఏకంగా రూ.1,650 పడిపోయిం రూ.75,950కి తగ్గింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల ధర రూ.62,130, 22 క్యారెట్ల ధర రూ.56,950, కిలో వెండి రూ.82 వేల వద్ద ఉన్నది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 2,023 డాలర్లకు, వెండి 24.44 డాలర్లకు పడిపోయింది.