న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్ఈసీ)లో హైదరాబాదీ ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్కు ఊరట దక్కింది. ఉక్రెయిన్ సహా మరికొన్ని దేశాల్లో హెల్త్కేర్ ప్రొఫెషనల్స్కు రెడ్డీస్ వర్గాలు అక్రమ చెల్లింపులు జరిపాయంటూ వచ్చిన ఓ ఫిర్యాదుపై జరిగిన దర్యాప్తులో ఎస్ఈసీ రెడ్డీస్కు క్లీన్ చిట్ ఇచ్చింది.
ఎలాంటి ఎన్ఫోర్స్మెంట్ చర్యలను దర్యాప్తు అధికారులు సిఫార్సు చేయలేదని రెడ్డీస్ వెల్లడించింది.