హైదరాబాద్, ఫిబ్రవరి 2: హైదరాబాద్ కేంద్రంగా ఎరువుల విక్రయ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.8,350 కోట్ల ఆదాయంపై రూ.539 కోట్ల నికర లాభాన్ని గడించింది.
అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.5,101 కోట్ల ఆదా యం పోలిస్తే 64 శాతం పెరగగా.. రూ.379 కోట్ల లాభం కంటే 42 శాతం అధికం.