న్యూఢిల్లీ, మే 9: టాటా మోటర్స్ కూడా కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు సంస్థలు కస్టమర్లను ఆకట్టుకోవడానికి భారీగా రాయితీలు ప్రకటించగా..ఇదే జాబితాలోకి టాటా మోటర్స్ కూడా చేరింది. కంపెనీకి చెందిన అన్ని రకాల మాడళ్లపై రూ.3 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నది. దీంట్లో ఎక్సేంజ్ బోనస్, డిస్కౌంట్, కార్పొరేట్ డిస్కౌంట్, నగదు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు ఇస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.
ప్రముఖ వాహన సంస్థ టాటా మార్కెట్లోకి నెక్సాన్ ప్యూర్+ పీఎస్ మాడల్ను తీసుకొచ్చింది. పానోరమిక్ సన్రూఫ్తో తీర్చిదిద్దిన ఈ కారు ప్రారంభ ధర రూ.9.59 లక్షలుగా నిర్ణయించింది. దీంతో పెట్రోల్ రకం రూ.9.59 లక్షల నుంచి రూ.10.14 లక్షల లోపు లభించనుండగా, సీఎన్జీ మాడల్ రూ.10.39 లక్షలుగాను, డీజిల్ రకం రూ.10.54 లక్షల నుంచి రూ.11.19 లక్షల లోపు లభించనున్నది. ఈ ధరలు న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
1.2 లీటర్ టర్బోచార్జ్ ఇంజిన్ కలిగిన ఈ మాడల్ పెట్రోల్, ట్విన్ సిలిండర్ ఐసీఎన్జీ రకంతోపాటు డీజిల్ ఇంజిన్తో కూడా తీర్చిదిద్దింది. వాయిస్తో పానోరమిక్ సన్రూఫ్ను కంట్రోల్ చేసే టెక్నాలజీతో తయారైన ఈ కారులో 26 సెంటిమీటర్ల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆరు స్పీకర్లు, హెచ్డీ రియర్ కెమెరా, ఆటో ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్ వంటి ఫీచర్స్తో తయారు చేసినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.