ఉన్నత చదువులు చదవాలనుకుంటున్నారా! అయితే మీకు రుణం ఇవ్వడానికి ప్రభుత్వరంగ బ్యాంకులతోపాటు ప్రైవేట్ రంగ బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు పోటీపడుతున్నాయి. దేశీయ, విదేశాల్లో ఉన్నత చదువులు చదివేవారికి బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) 7.95 శాతం నుంచి 11.15 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తుండగా..మరో సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) 8.45 శాతం నుంచి 10.75 శాతం వరకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) 8.65 శాతం నుంచి 11.40 శాతం వరకు ఆకర్షణీయమైన వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. వీటిలో ప్రభుత్వరంగ బ్యాంకులు సరాసరిగా 7.95 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుండగా..ప్రైవేట్ రంగ బ్యాంకులు 9.5 శాతం వడ్డీకి రుణాలు ఇస్తున్నాయి. ఎన్బీఎఫ్సీ, ఫిన్టెక్ సంస్థలు అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.