Bank Accounts | గతంతో పోలిస్తే బ్యాంకులో ఖాతా ప్రారంభించాలంటే పాన్ కార్డు, ఆధార్, అడ్రస్ తదితర వివరాలు తెలిపే పత్రాలు సమర్పించాల్సిందే. ఇప్పటికే బ్యాంకులో ఖాతా తెరిచినా.. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా కేవైసీ పత్రాలు సమర్పించాల్సిందే. అలా సమర్పించని పక్షంలో మీకు బ్యాంకు అధికారులు మెసేజ్ పంపుతారు. మీ ఖాతా స్తంభించి పోతుంది. లావాదేవీలు నిర్వహించలేదు. సదరు ఖాతాలను యాక్టివేట్ చేసుకోవడానికి కూడా ఆర్బీఐ నిబంధనలు ఉన్నాయి. బ్యాంకు ఖాతాదారుల ‘కేవైసీ’ నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి.
హై రిస్క్ కస్టమర్లు ప్రతి రెండేండ్లకోసారి కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. మీడియం, సాధారణ రిస్క్ ఖాతాదారుల ఎనిమిదేండ్ల నుంచి పదేండ్ల వరకు అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2019 మే 29న జారీ చేసిన కేవైసీ సర్క్యులర్’ను ఆర్బీఐ గత మే నాలుగో తేదీన అప్ డేట్ చేసింది. దీని ప్రకారం ప్రతి బ్యాంకు ఖాతాదారు పాన్ కార్డు గానీ, ఫామ్-16 గానీ సమర్పించకుంటే ఆ ఖాతా తాత్కాలికంగా నిలిచిపోతుంది.
అలా తాత్కాలికంగా నిలిచిపోయిన బ్యాంకు ఖాతాను రీయాక్టివేట్ చేసుకోవడానికి మీరు నేరుగా బ్యాంకు శాఖకు వెళ్లి కేవైసీ ఫామ్ నింపి, అందుకు సంబంధించిన పత్రాలు సమర్పించి అప్ డేట్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు.
బ్యాంక్ ఆన్ లైన్ బ్యాంకింగ్ లో లాగిన్ కావాలి. కేవైసీ ట్యాబ్ మీద క్లిక్ చేసి.. స్క్రీన్ మీద వచ్చే సూచనలకు అనుగుణంగా మీ పేరు, అడ్రస్, బర్త్ డే వివరాలు నింపాలి. ఆధార్, పాన్, ఇతర పత్రాల స్కా్న్డ్ కాపీలు అప్ లోడ్ చేయాలి. అటుపై సబ్మిట్ బటన్ నొక్కితే సరి.. బ్యాంకు నుంచి మీకు సర్వీస్ నంబర్ వస్తుంది. ఈ సర్వీస్ నంబర్ మీ రిజిస్టర్ ఫోన్ నంబర్కు ఎస్ఎంఎస్ రూపంలో గానీ, ఈ-మెయిల్ లో గానీ వస్తుంది.