Honor Pad X9 | చైనాకు చెందిన టెక్నాలజీ సంస్థ హానర్.. భారత్ మార్కెట్లోకి ‘హానర్ పాడ్ ఎక్స్9’ టాబ్లెట్ ఆవిష్కరించింది. హానర్ పాడ్ ఎక్స్8 అప్డేటెడ్ వర్షన్గా తీసుకొచ్చిన హానర్ పాడ్ ఎక్స్9 టాబ్లెట్.. 11.5 అంగుళాల డిస్ ప్లే, 6-సరౌండ్ స్పీకర్లతో వస్తున్నది. 7250 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్న హానర్ పాడ్ ఎక్స్9 టాబ్లెట్..4జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్గా వస్తున్నది. దీని ధర రూ.14,499. స్పేస్ గ్రే కలర్ ఆప్షన్లో విడుదలైంది.
ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ వెబ్ సైట్ ద్వారా ఆగస్టు రెండో తేదీ నుంచి ప్రీ బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. ప్రీ-బుకింగ్స్ చేసుకున్న వారికి రూ.500 డిస్కౌంట్ ప్లస్ ఫ్రీ ఫ్లిప్ కవర్ అందిస్తారు.