న్యూఢిల్లీ, డిసెంబర్ 16: జపాన్కు చెందిన కార్ల తయారీ సంస్థ హోండా కూడా తన వాహన ధరలను పెంచబోతున్నది. జనవరి నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల మోడళ్ల ధరలను రూ.30 వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఉత్పత్తి వ్యయం అధికం కావడంతోపాటు కాలుష్య ఉద్గారానికి సంబంధించిన నియమ నిబంధనలను అమలు చేయడంతో పడే భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ధరలను పెంచుతున్నట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ కునల్ బెహ్ల తెలిపారు. ఆయా మోడళ్లను బట్టి ధరలు పెంపు అధికంగా ఉంటుందన్నారు.