బడంగ్పేట, జూలై 8 : పట్టణ ప్రగతిలో ప్రజలను భాగస్వాములను చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆర్సీఐ రోడ్డులో మొక్కలు నాటి నీళ్లు పోశా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణప్రగతిలో గుర్తించిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలన్నారు. కాలనీలు గ్రీనరీగా మారాలన్నారు. పార్కులు, రోడ్లకు ఇరువైపులా శ్మశాన వాటికల్లో మొక్కలు నాటాలన్నారు. చెరువుల సుందరీకరణ చేయడంతో పాటు పార్కులను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. చెరువు కట్టకు ఇరువైపులా మొక్కలు నాటించాలన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, అధికారులు సమన్వయంతో పనిచేసి పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. కాలనీ అసోసియేషన్, మహిళా సంఘాలను భాగస్వాములను చేయాలన్నారు. అవసరం అయిన నిధులను ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. కార్యక్రమంలో మీర్పేట మున్సిప ల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూ టీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ సుమన్రావు, ఆర్సీఐ జనరల్ మేనేజర్ గౌస్ పాషా, కార్పొరేటర్లు సిద్ధాల బీరప్ప, కో-ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఉన్నారు.