వెయ్యి వరకు పెరిగిన ధరలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజ సంస్థ హీరో మోటోకార్ప్ ధరలను పెంచింది. ఆయా టూవీలర్లపై వెయ్యి రూపాయల వరకు పెంచినట్టు గురువారం తెలియజేసింది. మోటర్సైకిళ్లు, స్కూటర్లపై పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ఈ సందర్భంగా ప్రకటించింది.
భారంగా మారిన తయారీ ఖర్చుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. కాగా, ఢిల్లీ ఎక్స్షోరూం ప్రకారం రూ.55,450 నుంచి రూ.1.36 లక్షల శ్రేణిలో టూవీలర్లను మార్కెట్లో హీరో అమ్ముతున్నది.