న్యూఢిల్లీ : ఆర్ధిక మందగమనం, ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడుతుండటంతో టెక్ దిగ్గజాల నుంచి స్టార్టప్ల వరకూ వ్యయ నియంత్రణ పేరుతో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. స్విగ్గీ, వేదాంతు సహా ఇటీవల పలు కంపెనీలు తమ సిబ్బందిని తొలగించే ప్రణాళికలకు పదునుపెట్టగా తాజాగా హెల్త్టెక్ స్టార్టప్ ఫార్మ్ఈజీ ఇదే బాటన పయనిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో పలువురు ఉద్యోగులను తొలగించిన ఫార్మ్ఈజీ తాజాగా మరో దశ లేఆఫ్స్కు తెగబడింది.
ప్రోడక్ట్, టెక్నాలజీ, క్వాలిటీ ఎనలిటిక్స్, సపోర్ట్ విభాగాల్లో పలువురు ఉద్యోగులపై ఫార్మ్ఈజీ వేటు వేసింది. టెక్నాలజీ, డిజైన్ టీముల్లో కూడా లేఆఫ్స్ ప్రభావం ఉందని ఇంక్42 రిపోర్ట్ వెల్లడించింది. స్ధూల ఆర్ధిక పరిస్ధితులు ప్రతికూలంగా ఉండటం, రష్యా-ఉక్రెయిన్ వివాదం సహా పలు కారణాలతో కంపెనీ లేఆఫ్స్కు తెగబడినట్టు చెబుతున్నారు.
ప్రతికూల పరిస్ధితులతో స్టార్టప్లనూ సంక్షోభం చుట్టుముట్టవింది. పలు విభాగాల స్టార్టప్లు లేఆఫ్స్కు తెరలేపాయి. ఈనెలలో స్విగ్గీ పలు డిపార్ట్మెంట్లకు చెందిన దాదాపు 250 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఇక ఎడ్యుటెక్ కంపెనీ వేదాంతు నాలుగో విడత లేఆఫ్స్లో 385 మంది ఉద్యోగులను సాగనంపింది. మరో ఎడ్యుటెక్ స్టార్టప్ బైజూస్ రానున్న ఆరునెలల్లో 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికలు రూపొందించింది.