HDFC | ముంబై, ఏప్రిల్ 15: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.12,594.5 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.10,443.01 కోట్ల లాభంతో పోలిస్తే 20.6 శాతం పెరిగింది. సమీక్షకాలంలో బ్యాంక్ స్టాండ్లోన్ ఆదాయం రూ.41,086 కోట్ల నుంచి రూ.53,850 కోట్లకు చేరుకున్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది.