న్యూఢిల్లీ, జూలై 7: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్ల వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. పెరిగిన వడ్డీరేట్లు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయని బ్యాంక్ పేర్కొంది.
దీంతో ఒక్కరోజు కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటు 15 బేసిస్ పాయింట్లు అధికమవడంతో రేటు 8.10 శాతానికి చేరుకోగా..నెల రుణాలపై 10 బేసిస్ పాయింట్లు పెరగడంతో వడ్డీరేటు 8.30 శాతానికి చేరుకున్నది. అలాగే మూడు నెలల రుణాలపై ఎంసీఎల్ఆర్ 8.50 శాతం నుంచి 8.60 శాతానికి పెంచిన బ్యాంక్.. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ని 8.85 శాతం నుంచి 8.90 శాతానికి సవరించింది.