న్యూఢిల్లీ, జనవరి 12: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.4,350 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది హెచ్సీఎల్ టెక్నాలజీ. క్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.4,096 కోట్ల లాభంతో పోలిస్తే 6.2 శాతం చొప్పున పెరిగింది. కన్సాలిడేటెడ్ ఆదాయం కూడా ఏడాది ప్రాతిపదికన 6.5 శాతం ఎగబాకి రూ.26,700 కోట్ల నుంచి రూ.28,446 కోట్లకు చేరుకున్నది.
గత త్రైమాసికంలో కొత్తగా 3,818 మంది ఫ్రెషర్లను నియమించుకోవడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,24, 756కి చేరుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధిలో 5 శాతం నుంచి 5.5 శాతం మధ్యలో ఉంటుందని అంచనావేస్తున్నది.