GST Rules | కేంద్ర ప్రభుత్వం తన రెవెన్యూ పెంచుకునే మార్గాలను విస్తరిస్తున్నది. బిజినెస్ టు బిజినెస్ లావాదేవీలు రూ.20 కోట్ల టర్నోవర్ దాటితే ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన 2022 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ మండలి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చట్టం ప్రకారం బిజినెస్ టు బిజినెస్ (బీ2 బీ) లావాదేవీలు రూ.500 కోట్లకు చేరితే సదరు సంస్థలు ఇన్వాయిస్లు జారీ చేయడం తప్పనిసరి అని 2020 అక్టోబర్ ఒకటో తేదీన కేంద్రం ప్రకటించింది. దాన్ని గతేడాది జనవరి ఒకటో తేదీ నాటికి రూ.100 కోట్లకు కుదించేసింది.
గతేడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రూ.50 వేల కోట్ల టర్నోవర్ దాటిన సంస్థల బిజినెస్ లావాదేవీలపై ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ (ఈ-వాయిస్) జనరేట్ చేచేస్తున్నది. తాజాగా దాన్ని రూ.20 కోట్ల టర్నోవర్ గల సంస్థలకు వర్తింపజేయడంతో దేశంలోని లక్షల కంపెనీలపై నూతన జీఎస్టీ రూల్ ప్రభావం చూపుతుంది. కేంద్రం తాజా నిర్ణయంతో ఈ-ఇన్వాయిస్లు సమర్పించాల్సిన సంస్థల సంఖ్య పెరుగనున్నది.
ఒకవేళ ఈ-ఇన్వాయిస్లు సమర్పించని సంస్థలు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ పొందలేవు సరికదా పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుంది. ఈమేరకు కేంద్ర వస్తు సేవల పన్ను నిబంధనలను సవరించింది. జీఎస్టీ కౌన్సిల్ సిఫారసుల మేరకు సీజీఎస్టీ రూల్స్-2017లోని 48వ నిబంధనలో నాల్గవ సబ్ రూల్ చేర్చింది.