GST | న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: పన్ను భారం నుంచి రీఇన్సూరెన్స్కు విముక్తి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత రీఇన్సూరెన్స్కు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మినహాయింపును పరిశీలించనున్నట్టు తెలుస్తున్నది. దీనిపై జీఎస్టీ మండలి సమీక్ష చేపడుతుందని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి చెప్తున్నారు. దీంతో బీమా సంస్థలకు గొప్ప ఊరటే లభించే వీలున్నది.
దేశీయ బీమా రంగంలోని చాలా ప్రధాన సంస్థలు.. రీఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ బకాయిలకు సంబంధించి గత ఏడాది తాము నోటీసులను అందుకున్నట్టు తెలిపాయి. కాగా, ఏ సర్వీస్ సైప్లెకైనా 18 శాతం పన్నున్నది. అయితే రీఇన్సూరెన్స్ అనేది సైప్లె కిందకు రాదని, దాంతో జీఎస్టీ దీనికి వర్తించబోదని జీఎస్టీ ఫిట్మెంట్ కమిటీ అభిప్రాయపడినట్టు సమాచారం.
ఈ క్రమంలోనే ఎన్నికల తర్వాత జరిగే జీఎస్టీ మండలి తదుపరి సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనను ఫిట్మెంట్ కమిటీ పెట్టనున్నదని సదరు అధికారి వెల్లడించారు. రిస్క్ను తగ్గించుకోవడానికి బీమా సంస్థలు కొనే ఇన్సూరెన్సే రీఇన్సూరెన్స్. పాలసీదారుకు తాము అమ్మిన పాలసీ రిస్క్ కవరేజీలో కొంత భాగాన్ని రీఇన్సూరర్కు బీమా కంపెనీలు బదిలీ చేస్తాయి. ఇందుకోసమే రీఇన్సూరెన్స్ కంపెనీలకు బీమా కంపెనీలు ప్రీమియంలు చెల్లిస్తాయి. ఈ ప్రీమియంలపైనే పన్ను చెల్లించాలని జీఎస్టీ మండ లి అంటుండగా, తమపై భారం పెరుగుతోందని బీమా సంస్థలు వాపోతున్నాయి.