న్యూఢిల్లీ, డిసెంబర్ 31: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)కు సంబంధించి జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు ఆదివారం నుంచి అమల్లోకి రానున్నాయి. పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డు (సీబీఐసీ) వివరాల ప్రకారం జనవరి 1 నుంచి నివాసం నిమిత్తం యజమానికి అద్దెకిచ్చే ఇల్లుపై జీఎస్టీ చెల్లించనక్కర్లేదు. అలాగే రిఫైనరీలకు సరఫరా చేసే ఇథైల్ ఆల్కాహాల్పై 5 శాతం జీఎస్టీ పడుతుంది.
మరోవైపు పప్పుల పొట్టుపై 5 శాతం జీఎస్టీ తొలగిపోతున్నది. డిసెంబర్ 17న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ పలు సిఫార్సులు చేసిన విషయం తెలిసిందే.