న్యూఢిల్లీ, డిసెంబర్ 1: జీఎస్టీ వసూళ్లు మరింత పెరిగాయి. గత నెల రూ.1.46 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిరుడు నవంబర్లో వసూలైన రూ.1,31,526 కోట్లతో పోలిస్తే 11 శాతం అధికమన్నది. కాగా, రూ.1.4 లక్షల కోట్ల కంటే అధికంగా జీఎస్టీ వసూలవడం వరుసగా ఇది తొమ్మిదో నెల. గత నెల రూ.1,45,867 కోట్ల జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ కింద రూ.25,681 కోట్లు, స్టేట్ జీఎస్టీ కింద రూ.32,651 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ కింద రూ.77,102 కోట్లు, సెస్ రూపంలో రూ.10,433 కోట్లు వసూలయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్ళు అంతకంతకు పెరుగుతున్నాయి. గత నెలకుగాను రూ.4,228 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. అంతక్రితం ఏడా ది ఇదే నెలలో వసూలైన రూ.3,931 కోట్లతో పోలిస్తే 8 శాతం అధికమని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీ వసూ ళ్ళు 14 శాతం అధికమై రూ.3,134 కోట్లుగా నమోదయ్యాయి.