న్యూఢిల్లీ : ఈ ఏడాది అక్టోబర్లో జీఎస్టీ రికార్డు (GST collection) వసూళ్లను నమోదు చేసింది. ఏప్రిల్ తర్వాత రెండో అత్యధిక పన్ను వసూళ్లు నమోదయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే అక్టోబర్లో జీఎస్టీ వసూళ్లు 13 శాతం వృద్ధితో ఏకంగా రూ. 1.72 లక్షల కోట్లుగా నిలిచాయి.
దేశీ లావాదేవీలతో పాటు, సేవల దిగుమతి వంటి పలు విభాగాల్లో వృద్ధితో జీఎస్టీ రాబడి గణనీయంగా పెరిగిందని ఆర్దిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. 2023-24లో రాబడి వృద్ధి దిశగా జీఎస్టీ వసూళ్లు అనూహ్యంగా పెరిగాయి.
ఇక నెలసరి సగటు జీఎస్టీ వసూళ్లు రూ. 1.66 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. సగటు జీఎస్టీ వసూళ్లు గతేడాదితో పోలిస్తే 11 శాతం వృద్ధి నమోదు చేశాయి.ఇక జీఎస్టీ వసూళ్లు మెరుగ్గా ఉండటంతో ఈ ఏడాది వృద్ధి రేటు ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నారు.
Read More :