హైదరాబాద్, ఫిబ్రవరి 27: గ్రాన్యూల్స్ మరో ఔషధానికి అమెరికా నియంత్రణ మండలి అనుమతినిచ్చింది. అధిక రక్తపోటును నియంత్రించే కంపెనీకి చెందిన జనరిక్ మందుకు అమెరికా హెల్త్ రెగ్యులేటర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 25 ఎంజీ, 50 ఎంజీ, 100 ఎంజీలో లభించనున్న లోసార్టన్ పొటాషియం ట్యాబ్లెట్ను అక్కడి మార్కెట్లో విక్రయించడానికి అనుమతి లభించినట్లు కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది. ప్రస్తుతం అమెరికాలో ఈ ట్యాబ్లెట్ల మార్కెట్ విలువ 336 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నది.