హైదరాబాద్, ఏప్రిల్ 13: గ్రాన్యూ ల్స్ ఇండియాకు చెందిన ప్లాంట్లో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్గ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ) ఉన్నతాధికారులు తనిఖీలు చేశారు. విశాఖపట్నంలో ఉన్న ప్లాంట్ను ఈ నెల 8 నుంచి 12 వరకు తనిఖీలు చేసి జీరో 483 అబ్జర్వేషన్ ఇచ్చింది.
ఈ ప్లాంట్లో ఏపీఐఎస్, ఫార్ములేషన్కు సంబంధించిన పలు ఔషధాలు తయారు చేస్తున్నది సంస్థ. ఈ సందర్భంగా కంపెనీ సీఎండీ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ..అమెరికా ఎఫ్డీఏ ఆడిట్స్ నిర్వహించిన తనిఖీలో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడం విశేషమని, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా గ్లోబల్ జనరిక్ ఔషధాలను తయారు చేస్తున్నట్లు తెలిపారు.