LIC IPO | భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) పట్ల ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి లేదా.. ఇది నిజమేనా.. అంటే ప్రభుత్వ వర్గాలు అవునంటున్నాయి. తొలుత ఏడు శాతం వాటా అంటే రూ.50 వేల కోట్ల మేరకు వాటాలు ఉపసంహరించుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ భావించారు. కానీ ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ లేనందు వల్ల ఎల్ఐసీ ఐపీవో వాటాను 40 శాతం కుదించాలని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.
ఉక్రెయిన్పై రష్యా దండయాత్రకు ముందు రూ.50 వేల కోట్ల విలువైన వాటాలను ఉపసంహరించాలని కేంద్రం నిర్ణయించింది. కానీ మారిన పరిస్థితుల్లో ఇప్పుడు రూ.30 వేల కోట్లు (3.9 బిలియన్ల డాలర్ల) విలువైన వాటాల విక్రయానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
వచ్చే రెండు వారాల్లో ఎల్ఐసీ ఐపీవో.. స్టాక్ మార్కెట్లను తాకనున్నది. ఆ దిశగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని ప్రకారం ఎల్ఐసీలో ఐదు శాతానికి పైగా వాటాలను ఐపీవోలో విక్రయిస్తారు. ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.6 లక్షల కోట్లు ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం సెబీ నుంచి లభించిన అనుమతుల ప్రకారం మే 12 లోపు ఎప్పుడైనా ఎల్ఐసీ ఐపీవోకు వెళ్లొచ్చు.