న్యూఢిల్లీ, జూన్ 30: చిన్న మొత్తాలపై వడ్డీరేటును యథాతథంగా ఉంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జూలై నుంచి సెప్టెంబర్ చివరి వరకు) చిన్న మొత్తాలతోపాటు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)పై కూడా వడ్డీరేట్లను ముట్టుకోలేదు. అధిక ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు పెరుగుతుండటం వల్లనే వీటిపై వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది నరేంద్ర మోదీ సర్కార్. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నుంచి వీటిపై వడ్డీరేట్లు యథాతథంగా ఉంటున్నాయి. పీపీఎఫ్పై 7.1 శాతం, ఎన్ఎస్సీపై 6.8 శాతం వడ్డీని చెల్లిస్తున్నారు.