న్యూఢిల్లీ, అక్టోబర్ 5: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాం క్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా పదవీకాలాన్ని పొడిగించారు. ఈ మేరకు గురువారం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో వచ్చే ఏడాది ఆగస్టుదాకా ఎస్బీఐ చీఫ్గా దినేశ్ కొనసాగనున్నారు. నిజానికి శుక్రవారం (అక్టోబర్ 6)తోనే దినేశ్ మూ డేండ్ల పదవీకాలం ముగుస్తున్నది.
ఈ క్రమంలోనే మరో 10 నెలలకుపైగా కాలాన్ని పెంచారు. అయితే వచ్చే ఏడా ది ఆగస్టు 28తో దినేశ్కు 63 ఏండ్లు నిండుతాయి. అప్పటిదాకా ఎస్బీఐ చైర్మన్గా ఆయనే ఉంటారని అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ (ఏసీసీ) తమ ఆదేశాల్లో పేర్కొన్నట్టు చెప్తున్నారు. ఇదిలావుంటే ఎస్బీఐ ఎండీల్లో ఒకరైన అశ్వినీ కుమార్ తివారీ పదవీకాలాన్ని కూడా రెండేండ్లు ఏసీసీ పొడిగించినట్టు సమాచారం. వచ్చే ఏడాది జనవరి 27తో ఈయన పదవీకాలం ముగుస్తున్నది.