LIC | కేంద్ర ప్రభుత్వ రంగ బీమా సంస్థ.. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) మేనేజింగ్ డైరెక్టర్గా ఆర్ దొరైస్వామి నియమితులయ్యారు. ప్రస్తుతం ముంబైలోని ఎల్ఐసీ సెంట్రల్ ఆఫీసులో దొరైస్వామి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఎల్ఐసీ ఎండీగా ఉన్న ఇపె మినీ స్థానంలో దొరైస్వామి నియమితులయ్యారు. వచ్చేనెల ఒకటో తేదీన దొరైస్వామి బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ పదవిలో దొరైస్వామి 2026 ఆగస్టు 31 వరకూ గానీ, తదుపరి ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసే వరకు గానీ కొనసాగుతారని రెగ్యులేటరీ ఫైలింగ్లో ఎల్ఐసీ తెలిపింది.
కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల అధిపతుల ఎంపికకు పని చేస్తున్న ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) గత నెలలో దొరై స్వామిని ఎల్ఐసీ ఎండీగా నియమించాలని కేంద్రానికి సిఫారసు చేసింది. ఎఫ్ఎస్ఐబీ సిఫారసుల మేరకు కేంద్రం.. దొరైస్వామిని ఎల్ఐసీ ఎండీగా నియమించింది. ఎఫ్ఎస్ఐబీ అధిపతిగా కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణా వ్యవహారాల విభాగం మాజీ కార్యదర్శి ప్రతాప్ శర్మ ఉన్నారు. ఇందులో సభ్యులుగా ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి, ప్రభుత్వ రంగ సంస్థల విభాగం కార్యదర్శి, ఐఆర్డీఏఐ చైర్మన్ దేబాసిష్ పాండా, ఎల్ఐసీ మాజీ ఎండీ ఉషా సాంగ్వాన్, ఓరియంట్ ఇన్సూరెన్స్ సంస్థ మాజీ ఎండీ ఏవీ గిరిజా కుమార్ ఉన్నారు.