న్యూఢిల్లీ, ఏప్రిల్ 29 : దివ్యాంగుల ఆర్థిక సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా కంపెనీలు, ఆర్థిక సేవల సంస్థలను ఆర్థిక సేవల శాఖ సూచించింది.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రత్యక్ష నియామకాలు, ఉద్యోగోన్నతుల్లో బెంచ్మార్క్ వైకల్యాలు ఉన్న వ్యక్తులకు రిజర్వేషన్లు కల్పించాలని సూచించింది. చీఫ్ లైజన్ ఆఫీసర్/లైజన్ ఆఫీసర్లుగా వీరిని నియమించాలని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో సూచించింది.