హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): గూగుల్..ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద డాటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. వైజాగ్ జిల్లా తర్లువాడలో గూగుల్ ఏఐ డాటా హబ్కు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్తో కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం భూమి పూజ చేశారు.
రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో గూగుల్ 1 గిగావాట్ల సామర్థ్యంతో మూడు డాటా సెంటర్లను నెలకొల్పోబోతున్నది.