న్యూఢిల్లీ, ఆగస్టు 26: ఎయిర్ ఇండియా ఉద్యోగులకు శుభవార్తను అందించింది టాటా సన్స్ యాజమాన్యం. కరోనా సమయంలో ఉద్యోగుల జీతాలు తగ్గించిన సంస్థ..ప్రస్తుతం వీటిని పునరుద్దరిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. దీంతో కరోనా కంటే ముందు ఉన్న స్థాయికి సిబ్బంది జీతాలు పెరగనున్నాయి.
వచ్చే నెల 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ క్యాంప్బెల్ విల్సన్ తెలిపారు. విమాన సంస్థను లాభాల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. ఈ మహమ్మారి కారణంగా ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ మొత్తం కుదేలైందని, దీంతో సంస్థలు చేసేదేమిలేక ఖర్చులు తగ్గించుకోవడానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. ముఖ్యం గా సిబ్బంది వేతనాలు కోత విధించారు.