న్యూఢిల్లీ : ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ శాక్స్ భారత్లో 30 మంది ఎగ్జిక్యూటివ్లకు మేనేజింగ్ డైరెక్టర్లు (ఎండీ)గా పదోన్నతి కల్పించింది. ప్రపంచంలోనే అత్యధికంగా భారత్ ఎగ్జిక్యూటివ్లను ఎండీలుగా ప్రమోట్ చేసింది. భారత్ తమకు అత్యంత కీలక మార్కెట్ అని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఈ పదోన్నతుల ద్వారా సంకేతాలు పంపింది. ఈ ఏడాది గోల్డ్మన్ 643 మంది ఉద్యోగులను ఎండీలుగా ప్రమోట్ చేయగా వీరిలో ఏకంగా 71 మంది భారతీయులు కావడం గమనార్హం.
నూతన ఎండీలు జనవరి 1న బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక భారత్లో ముంబై కార్యాలయం నుంచి ఒకరికి ఎండీగా పదోన్నతి రాగా, కంపెనీ బెంగళూర్ కార్యాలయంలో 29 మందికి ఎండీలుగా పదోన్నతి కల్పించింది. ఈ ఏడాది జులైలో కంపెనీ హైదరాబాద్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. గోల్డ్మన్కు భారత్లో 8000 మంది ఉద్యోగులున్నారు.