జ్యోతినగర్, జూన్ 23: ప్రస్తుత సంవత్సరానికిగాను ఎనర్జీ ఎఫిషియెన్సీ విభాగంలో ఎన్టీపీసీ రామగుండం యూనిట్కు గోల్డెన్ పీకాక్ అవార్డు వరించింది. గురువారం బెంగళూరులో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్(ఐవోడీ) నుంచి ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ కుమార్ ఈ అవార్డును అందుకున్నారు.
దేశంలో అతిపెద్ద 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను నిర్మించడంతోపాటు యాదాద్రి తరహా ఫారెస్ట్ ఏర్పాటుతో గ్రీన్ ఎనర్జీ, కార్బాన ఉద్గారాల తగ్గింపులో భాగమైనందుకుగాను ఎన్టీపీసీకి ఈ అవార్డు వరించింది. గడిచిన నాలుగేండ్లలో రామగుండం యూనిట్కు ఈ అవార్డు రావడం ఇది మూడోసారి.