న్యూఢిల్లీ: పసిడి ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర ( Gold rate ) రూ.302 తగ్గి రూ.46,848కి చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల పసిడి ధర రూ.47,150 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు రాత్రికి రాత్రే తగ్గడం, ఫారెక్స్ మార్కెట్లో అమెరికన్ డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ కాస్త మెరుగవడం ఇవాళ దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గడానికి కారణమైందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇదిలావుంటే వెండి ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర కేవలం రూ.81 తగ్గి రూ.61,031కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.61,112 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,778 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 22.74 అమెరికన్ డాలర్లు పలికింది.