న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు ( Gold price ) స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఇవాళ రూ.172 తగ్గి రూ.47,246కు చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.47,418 వద్ద ముగిసింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ కాస్త బలపడటమే ఇవాళ దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు
అయితే, వెండి ధరలు కూడా ఇవాళ స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.342 పెరిగి రూ.60,508కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.60,166 వద్ద ముగిసింది. అదేవిధంగా ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ డాలర్తో పోల్చితే 17 పైసలు మెరుగుపడింది. ఇక అంతర్జాతీయ మార్కట్లో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,797 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 22.53 అమెరికన్ డాలర్లు పలికింది.