Gold Rates | గ్లోబల్ మార్కెట్లో పరిస్థితులకు అనుగుణంగా శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం తులం (24 క్యారట్స్) ధర రూ.50 పెరిగి రూ.61,900 వద్ద స్థిర పడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది.
గురువారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.61,850 వద్ద నిలిచింది. గురువారంతో పోలిస్తే శుక్రవారం రూ.50 పెరిగి రూ.61,900లకు చేరిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. మరోవైపు, కిలో వెండి ధర రూ.600 తగ్గి, రూ.74,300 వద్ద స్థిర పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1987 డాలర్లు, ఔన్స్ వెండి 22.61 డాలర్లు పలికింది.
మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ఫ్యూచర్స్ తులం (24 క్యారట్స్) ధర రూ.49 పెరుగుదలతో రూ.60,960 వద్ద స్థిర పడింది. గ్లోబల్ మార్కెట్లో న్యూయార్క్లో ఔన్స్ బంగారం ధర స్వల్పంగా 0.08 శాతం పెరిగి 1995 డాలర్ల వద్ద ముగిసింది.