Gold – Silver Rates | అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం ధర పెరిగితే, వెండి ధర భారీగా పడిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర రూ.150 పెరిగి రూ.71,990కి చేరుకున్నదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది. సోమవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.71,840 వద్ద ముగిసింది. ఇదిలా ఉంటే కిలో వెండి ధర రూ.90,700 పలికింది. సోమవారం కిలో వెండి ధర రూ.92,100 వద్ద ముగిసింది. అంటే కిలో వెండి ధర ఒక్కరోజే రూ.1400 పతనమైందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ చెప్పారు.
అంతర్జాతీయ మార్కెట్లలో ‘కామెక్స్’లో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 10 శాతం పెరిగి 2303 డాలర్లు పలికింది. యూఎస్ ఫెడ్ రిజర్వు, అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలపై ఇన్వెస్టర్లు దృష్టిని కేంద్రీకరించారని సౌమిల్ గాంధీ తెలిపారు. వడ్డీరేట్ల హెచ్చు తగ్గులపై బంగారం ధరలు ఆధార పడి ఉంటాయని చెప్పారు. మరోవైపు, ఔన్స్ వెండి ధర మాత్రం 29.50 డాలర్ల నుంచి 29.20 డాలర్లకు పడిపోయింది.
నగరం – 22 క్యారట్స్ – 24 క్యారట్స్
చెన్నై – 66,450 – 72,490
ముంబై – 65,850 – 71,840
ఢిల్లీ – 66,000 – 71,990
కోల్కతా – 65,850 – 71,840
బెంగళూరు- 65,850 – 71,840
హైదరాబాద్ – 65,850 – 71,840
చెన్నై – రూ.95,000
ముంబై – రూ.90,500
ఢిల్లీ – రూ.90,500
కోల్ కతా – రూ.90,500
బెంగళూరు – రూ.90,250
హైదరాబాద్ – రూ.95,000