Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర మళ్లీ పెరిగింది. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర (24 క్యారెట్స్) రూ.100 పెరిగి రూ.62,950కి చేరుకున్నదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ రావడంతో బుధవారంతో పోలిస్తే, గురువారం తులం బంగారం ధర రూ.100 పెరిగి రూ.62,950 వద్ద స్థిర పడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. బుధవారం తులం బంగారం (24 క్యారెట్స్) ధర రూ.62,850 వద్ద ముగిసింది. మరోవైపు, కిలో వెండి ధర రూ.800 క్షీణించి రూ.77,300లకు పడిపోయింది. బుధవారం కిలో వెండి ధర రూ.78,100 వద్ద స్థిర పడింది.
మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో ఫిబ్రవరి కాంట్రాక్ట్ బంగారం ధర తులం (24 క్యారెట్స్) రూ.18 పెరిగి రూ.62,458 వద్ద స్థిర పడింది. మరోవైపు కిలో వెండి మార్చి కాంట్రాక్ట్ ధర కూడా రూ.61 పెరిగి రూ.74,892 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 2046.20 డాలర్లు పలికింది. కామెక్స్లో స్పాట్ గోల్డ్ క్రితం ట్రేడింగ్ తో పోలిస్తే రెండు డాలర్లు పెరిగి 2031 డాలర్ల వద్ద ముగిసింది.