హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ఐటీ కారిడార్లోని రాయదుర్గంలో తాము నిర్మించిన బిజినెస్ పార్కు టవర్ 1కి ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ ఇచ్చిందని ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి తెలిపారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ సీ శేఖర్ రెడ్డి నుంచి ఈ గోల్డ్ రేటింగ్ పత్రాన్ని అందుకున్నట్టు చెప్పారు.
రవాణా ఆధారిత అభివృద్ధి ట్రాన్సిట్ ఓరియెంట్ డెవలప్మెంట్-టీవోడీ)లో భాగంగా రాయదుర్గం మెట్రో స్టేషన్ సమీపంలో బిజినెస్ పార్కు టవర్ 1ను గతంలో నిర్మించింది సంస్థ. ఈవీల కోసం చార్జింగ్ పాయింట్లు, లో ఫ్లో ప్లంబింగ్ను, విద్యుత్ ఆదాకు సంబంధించిన పరికరాలను ఏర్పాటు చేశారు. ఈ భవనానికి ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ రావడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా కేవీబీ రెడ్డి తెలిపారు.