న్యూఢిల్లీ: దేశంలో బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. ఇవాళ ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.415 పెరిగి రూ.48,327కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.47,912 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు స్వల్పంగా పెరుగడమే దేశీయంగా వెండి, బంగారం ధరలు స్వల్పంగా పెరుగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
వెండి ధర కూడా ఇవాళ భారీగానే పెరిగింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.858 పెరిగి రూ.64,429కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.63,571 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,841 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 24.13 అమెరికన్ డాలర్లు పలికింది. హైదరాబాద్లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారట్ గోల్డ్ ధర రూ.500 పెరిగి రూ.49,700కి చేరింది.
అదేవిధంగా 10 గ్రాముల 22 క్యారట్ బంగారం ధర కూడా హైదరాబాద్లో బాగా పెరిగింది. తులం రూ.450 పెరిగి రూ.45,550కి చేరింది. ఇక హైదరాబాద్లో వెండి ధర వరుసగా రెండోరోజు రూ.1,500 పెరిగింది. జనవరి 18న రూ.65,800 ఉన్న కిలో వెండి ధర జనవరి 19న రూ.1,500 పెరిగి రూ.67,300కు చేరింది. జనవరి 20న మరో రూ.1,500 పెరిగి 68,800 పెరిగింది.